AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ లోవరాజు అనే వ్యక్తి మృతి చెందడంతో సంఖ్య 22కు చేరింది. మిగిలిన తొమ్మిది మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సామర్లకోట మార్చురీలో 11 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది.