ఉదయం అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మానేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందక నీరసం, అలసట, ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో జీవక్రియ మందగిస్తుంది. కడుపులో యాసిడ్స్ ఎక్కువై ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆకలిని తట్టుకోలేక మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో తినడం, లేదా జంక్ ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.