AP: లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఈనెల 27 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో వాసుదేవరెడ్డి ఏ2గా ఉన్నారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.