AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణ ముగిసింది. ఐపీఎస్ సునీల్ నాయక్ను అధికారులు విచారించారు. 7 గంటల పాటు విచారించినట్లు విజయనగరం ఎస్పీ దామోదర్ వెల్లడించారు. రేపు మరోసారి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.