మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న జగదీష్(37) అనే వ్యక్తి, రాత్రి భోజనంలో కాకరకాయ కూర నచ్చలేదన్న నెపంతో తన తల్లి సుమిత్రను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. భార్య వదిలేయడంతో తల్లి వద్దే ఉంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్షణికావేశం, వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.