AP: రాష్ట్ర ఉన్నత విద్యామండలి లాసెట్, పీజీ-ఎల్సెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది లా ప్రవేశ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.