AP: తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తల్లికి వందనం కింద 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల సాయం అందించామన్నారు. అర్హులందరికీ సాయం అందజేస్తామని, ఎవరికైనా అందకపోతే వివరాలు ఇస్తే సరిచేస్తామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.