TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్నెళ్ల తర్వాత జరిగిన MP ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 27 శాతం పెరిగిందన్నారు. కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోందన్నారు.