TG: వనపర్తి జిల్లాలో పోలీసులు నకిలీ స్వామిని అరెస్ట్ చేశారు. పెబ్బేరుకు చెందిన దంపతులు అనారోగ్య కారణాలతో దుర్గా సింగ్ను ఆశ్రయించారు. ఇంట్లో, వ్యవసాయ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని, తీయకపోతే పద్మ చనిపోతుందని నకిలీ స్వామి భయపెట్టాడు. ఇంట్లో గుంత తీసి లక్ష్మీదేవి విగ్రహాన్ని పాతాడు. విగ్రహాన్ని విదేశాల్లో రూ.150 కోట్లకు అమ్ముతానని, బాధితుల వద్ద రూ.40 లక్షలు వసూలు చేశాడు.