ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’లో పలువురు దేశాధినేతలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 8 ఏళ్ల ఓ బుడతడు రణ్వీర్ సచ్దేవా ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సదస్సులో అతిపిన్న కీనోట్ స్పీకర్గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా.. సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్లతోనూ భేటీ అయ్యారు.