వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానకం. దీన్ని ఒడిశా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. పండిన మారేడు పండు లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని.. తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి 15-20min నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని వడపోయాలి. ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు.