AP: దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. ‘లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. కల్తీ జరిగిందని స్పష్టంగా సీబీఐ నివేదికలో ఉంది. వైవీ సుబ్బారెడ్డి కూడా దీనిని ఒప్పుకున్నారు. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు’ అని హెచ్చరించారు