పచ్చి కొబ్బరి నీళ్లలో పోషకాలు అధికమని, ముదిరిన కాయల కంటే ఇవే మేలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తీసిన పదిహేను నిమిషాల్లోపు తాగితేనే విటమిన్-సి అందుతుందని, ఆలస్యమైతే గుణాలు తగ్గుతాయని తెలిపారు. ఇక అసిడిటీ, పేగుల్లో మంట ఉన్నవారు పుల్లని మజ్జిగకు దూరంగా ఉండటం మంచిది. వేసవి ఆరోగ్య రక్షణ కోసం ప్రజలు ఈ కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.