TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటున్నారని చెప్పారు. తాము ప్రభుత్వానికి భజన చేయాలా అని నిలదీశారు.