పోక్సో కేసులో యూపీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ మాజీ ఇంజినీర్ రామ్భావన్, ఆయన భార్యకు కోర్టు మరణశిక్ష విధించింది. 2010 నుంచి 33 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఆ 33 మంది చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పోక్సో ప్రత్యేక కోర్టు పేర్కొంది.