AP: పారిశ్రామికవేత్తలకు 20 నెలల్లోనే రూ.2 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందులో SC, ST పారిశ్రామికవేత్తలకు రూ.270 కోట్లు ఇచ్చామన్నారు. ఎవరి జోక్యమూ లేకుండా నేరుగా పారిశ్రామికవేత్తల ఖాతాల్లోనే ప్రోత్సాహకాలు జమయ్యేలా చూస్తున్నామన్నారు. టెండర్లలోSC, STలకు 4 శాతం రిజర్వేషన్ వర్తిపజేస్తున్నామని పేర్కొన్నారు.