ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా ఆందోళన చేపట్టిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు పాటియాల హౌస్ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను విచారించేందుకు పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఈ అనుమతిని ఇచ్చింది.