AP: YCP అధినేత జగన్ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కలిశారు. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లేందుకు జగన్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్రహ్మానందం.. జగన్ని చూసి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.