AP: లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు దాదాపు 4 గంటలపాటు చర్చించనున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ను రద్దు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించనున్నారు.