నేటి కాలంలో స్మార్ట్ఫోన్ వాడకం వ్యసనమైంది. అతిగా ఫోన్ వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మందగించడం జరుగుతుంది. సోషల్ మీడియా వాడకం వల్ల ఆందోళన, నిద్రలేమి వంటివి పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. మెడ, వెన్నునొప్పి వస్తుంది. అందుకే డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.