AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ.2,498 కోట్లతో రహదారుల నిర్మాణానికి అథారిటీ అనుమతి ఇచ్చినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి అనుమతి వచ్చినట్లు చెప్పారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.