AP: 1996 మార్చి 5న మార్కాపురానికి వచ్చానని.. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ నీళ్లు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మాకు శ్రీశైలం నీళ్లు కావాలని ఆనాడు అడిగారు. కృష్ణా జలాలు తీసుకొస్తానని ఆరోజు మాట ఇచ్చాను. వెలిగొండకు ఫౌండేషన్ నేనే చేశా.. పూర్తి చేసే అవకాశం నాకే వచ్చింది. దీంతో 4 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తాయి. పనులు పూర్తికాక ముందే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారు’ అని ఆరోపించారు.