TG: మూసీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రూ.లక్ష కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధిని తాము అడ్డుకోమని, కానీ పేదల ఇళ్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వెల్లడించారు.