JN: పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన రిపోర్టర్ ఎండి పాషా తండ్రి ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం భాషా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.