ప్రకాశం: మర్రిపూడి మండలం కేజీ కండ్రిక గ్రామంలో గత నెల రోజులుగా గ్రామస్థులు తాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ వారు గ్రామంలో కాలువ తీస్తూ పైపులు పగలగొట్టారని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. పంచాయతీ పదవి బాధ్యతలు ముగుస్తున్నాయని తమకు సంబంధంలేదని పంచాయతీ వారు అంటున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.