కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ని ఎవరో దొంగిలించారనే కలకలం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. మరీ విడ్డూరం. ఇంత పెద్ద సినిమా, అందులో ప్రభాస్ కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ని ఎవరో దొంగిలించేంత జాగ్రత్తగా ఉన్నారన్నమాట మంచు విష్ణు టీం అని విపరీతమైన ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న భారీ చిత్రం కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ని ఎవరో దొంగిలించారనే కలకలం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. మరీ విడ్డూరం. ఇంత పెద్ద సినిమా, అందులో ప్రభాస్ కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ని ఎవరో దొంగిలించేంత జాగ్రత్తగా ఉన్నారన్నమాట మంచు విష్ణు టీం అని విపరీతమైన ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.
కానీ మంచు విష్ణు మంచు అంత కూల్గా అదెవరు దొంగిలించారో తనకి తెలుసని చెప్పడం మరీ విచిత్రంగా అనిపించింది. అదెవరో కాదుట మళ్ళీ స్వయాన తన అనుంగు సోదరుడు, మంచు మనోజ్కి సంబంధించి. లేదా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గరే ఆ హార్డ్ డ్రైవ్ దొరికింది కాబట్టి, అది తప్పనిసరిగా మనోజ్ పనే అని చెప్పకనే విష్ణు తాజాగా హిట్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఆ విషయం కూడా పోలీసుల ప్రమేయం లేకుండా తమకే నేరుగా తెలిసిందని, పోలీసులు ఇప్పుడా వ్యవహారాన్ని ట్రాక్ చేస్తున్నారని వివరించాడు. ఒకవేళ పోలీసుల డైరెక్ట్ ఆపరేషన్లో గనక ఆ విషయం రూఢీ అయితే మాత్రం కఠినమైన శిక్షకు వాళ్ళు తయారుగా ఉండాలని కూడా హెచ్చరించినట్టుగా సూచించాడు. అదీ వరస. మీరేంటి మరీ అంత నిర్ల్యక్షంగా ఉన్నారని అడిగితే దయచేసి ఆ మాట వెనక్కి తీసుకొండని సదరు ప్రశ్నించిన జర్నలిష్ట్ కి ఆయన రిటార్ట్ కూడా ఇచ్చాడు. ఇది మరి నిర్లక్ష్యం కాకాపోతే మరేమటి అనడిగితే అస్సలు సీజి వర్క్ ఉన్న కంటెంట్ని ఎలా పంపిస్తారో తెలుసా అని విష్ణు ఓ సుదీర్ఘమైన పాఠం మొదలు పెట్టాడు.
అంతేగానీ, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా, ప్రభాస్ లాంటి ఓ గొప్ప స్టార్ మీద జరిగిన సీజిలని ఎలా సంరక్షించుకోవాలో కూడా తెలియని అబాధ్యతాయుతమైన ప్రక్రియని నిర్లక్ష్యం కాక మరేమని అనాలో అర్ధం కాక అయోమయంలో పడ్డ జర్నలిష్టుకి విష్ణు వ్యవహారం ఓ బ్రహ్మపదార్ధంలా కనిపించింది.
మొత్తానికి కథ కంచికి మనమింటికి అన్నట్టుగా చివరాఖరుకి ఆ హార్డ్ డ్రైవేదో దొరికేసింది కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే మరోసారి విష్ణుకి, మనోజ్కి మధ్యన పాకిస్తాన్ ఇండియా వార్లాంటిది బ్రేక్ అయ్యుండేది.