అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 3 ఇడియట్స్లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్న నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన వంటగదిలో ఏదో పనిలో ఉండగా ఉన్నట్లుండి పడిపోయి చనిపోయారు.
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డులు ఈ ఏడాది కూడా దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నెల 15, 16 రెండు రోజులు ఈ సెలబ్రేషన్స్ జరగనుండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు దుబాయ్ లో ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గతంలో హాలీవుడ్ లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమాలో ఆమె సందడి చేశారు. ఆ సమయంలో ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె విన్ డీజిల్ తో కలిసి ఫోటోలు కూడా దిగారు. వీరిద్దరూ కలిసి ఓ ఆటో కూడా ఎక్కారు. ఆయన ఇండియా వచ్చిన సందర్భంలో ఈ ఫోటోలు దిగినట్లు సమాచారం.