ప్రభాస్ ఓ జెయింట్ హీరోగా ఎంత విసుగెత్తిపోయాడంటే చివరికి తనకి ఇద్దరు హీరోయిన్లను పెట్టమని కోరుకునే స్థితికి వచ్చేశాడు. ఎంతసేపు పగ ప్రతీకారం, యాక్షన్, రివెంజ్ ఓపక్కన. మరోవైపు ఫుల్ లెంత్ ఫాంటసీ…సలార్, ఆదిపురుష్, మొన్న కల్కి. సలార్ హిట్. కల్కి వరల్డ్ వైడ్ హిట్. అంతా ఓకే. కానీ అసలుదేది? అదే రొమాన్స్, సరదాగా,జోవియల్గా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిపోయే పాత్రల కోసం ప్రభాస్ నిజంగానే ముఖం వాచిపోయి ఉన్నాడు అని రాజాసాబ్ దర్శకుడు మారుతి మాటల ద్వారానే తెలిసింది.
ఆ మధ్య ప్రిన్స్ మహేష్బాబుకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మహర్షి లాంటి స్క్రిప్టులతో మహేష్ కూడా విసిగెత్తిపోయాడు. అలా పొద్దస్తమానం స్టిఫ్గా, రాయిలా నిలబడి నటించడమంటే ఎంత హ్యూజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటే మాత్రం ఎంత కష్టం. ఒక సినిమా వరకూ ఏదో కొత్త క్యారెక్టర్, సరికొత్త కథా సంవిధానం అని సరిపట్టుకుని హీరోలు కమిట్ అవుతారు. మహేష్ నిజానికి మహర్షి సినిమాలో క్యారెక్టర్తో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్న మాటైతే వాస్తవమే. ఆ సినిమాకి గానూ వైజయంతీ మూవీస్కి గద్దర్ అవార్డు కూడా లబించింది. అది కూడా ఓకే.
కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఇక్కడే మొదలు. ఒక సినిమా హిట్ కాగానే హీరోకి అలాటి కథలు నచ్చుతాయేమోనని దర్శకరచయితలు అవే స్టీరియోటైపు కథలు పట్టుకుని మొదలవుతారు. తప్పక ఓ సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ అవే కథలంటే నరకంలా అనిపిస్తుంది హీరోలకి. అందుకే మహేష్ ఓపెన్గానే చెప్పాడు. కొంచెం లైటర్వెయిన్ కథలైతే బావుంటాయి, ఇలా రాక్లా నిలబడి ఎంత సేపు చెయ్యడం అని. దాంతో అనిల్ రావిపూడి కొంచెం జాగ్రత్తపడ్డాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా హెవీ బ్యాక్డ్రాప్ అయినా ట్రైన్ ఎపిసోడ్లు క్రియేట్ చేసి మహేష్ మెప్పు పొందాడు. మహేష్కి దూకుడులోలా అన్నీ వుండాలి, లైటర్ వెయిన్లో సాగాలి అనే కైండ్ ఆఫ్ స్టోరీలు, క్యారెక్టర్లు ఇష్టం ఒక్క మహేష్కే కాదు ఏ హీరోకైనా అదే ప్రిఫరెన్స్.
అదే దారిలోకి వచ్చేశాడు మన రెబల్ స్టార్ కూడా. రాజాసాబ్లో తనకి ఇద్దరు హీరోయిన్లను పెట్టమని మొహమాటం , అరమరికలు లేకుండా చెప్పుకున్నాడు. లేకపోతే ఆ జోనర్కే దూరమైపోయే ప్రమాదం ఉంటుంది. అదీగాక ప్రభాస్కి కూడా మోనోటనస్గా అయి కూర్చుంది. అప్పుడే ప్రభాస్కి దర్శకుడు మారుతి అభయం ఇచ్చాడు. ఇద్దరేంటి డార్లింగ్ నీ రేంజ్కి, ముగ్గురుని పెడతాను అని కథలో ముగ్గురు హీరోయిన్ల పాత్రలని సృష్టించి, ప్రభాస్కి స్క్రీన్ రొమాన్స్ తక్కువైపోయిందన్న లోటును తీర్చేశాడు. మాళవికా మోహనన్, నిది అగర్వాల్, రిధీ కుమార్ అనే ముగ్గురు హీరోయిన్లతో తెరకి నిప్పు పెట్టేశాడు మారుతీ.
అందుకోసమే టీజర్లో కూడా ఆ మసాలా టచ్చ్ ఇచ్చాడు. ఇందులో కావాల్సినంత హాట్ రొమాన్స్ ఉందనే క్లూ ఇచ్చాడు మారుతీ.