TG: యాంకర్ అనసూయ భరద్వాజ్పై అసభ్యకర పోస్టులు పెట్టిన మరో నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండకు చెందిన దొరెపల్లి చంటిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వివరాలను పోలీసులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదే కేసులో ఇటీవలే కడపకు చెందిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.