విద్యార్థులకు మంచు మోహన్ బాబు కీలక సూచనలు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో అయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో మీకు తెలుసు. మా కాలంలో ఫోన్లు లేవు, కానీ ఇప్పుడు అందరి దగ్గర రెండేసి ఉంటున్నాయి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించి, ఆశయాలను నెరవేర్చి ప్రయోజకులు కావాలి’ అని హితవు పలికారు.