విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ మూవీ OTT డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను జీ5 భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.