మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘కిక్’ మూవీ మంచి హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ రాగా.. పర్వాలేదనిపించింది. తాజాగా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు, ఆ మూవీ విషయంలో రవితేజ ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.