సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి సవిత ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు, కలెక్టర్, అధికారులకు కందికుంట వెంకటప్రసాద్ దంపతులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.