AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. భారత్ మండపంలో దాదాపు 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులతో జరిగే ‘రైసినా డైలాడ్-2026’లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘సాంకేతికత-సుపరిపాలన-భవిష్యత్’ అంశంపై చంద్రబాబు కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్ పౌర సేవలు సహా పలు అంశాలను వివరించనున్నారు.