PPM: గిరిజనుల సాంప్రదాయానికి ప్రతీక అయినా కందికొత్తులు పండుగ నేటి నుంచి ప్రారంభం కానున్నదని గిరిజన సంఘాలునాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొండపోడులో సాగు చేసిన కందులు జొన్నలు, రాగులు, కొర్రలు వరి పంటను ముందుగా గిరిజన దేవతకు నైవేద్యంగా సమర్పిస్తాము. అనంతరం వాటి ఆహారంగా స్వీకరిస్తామని పండగ జరిగే వరకు పంట చేతికొచ్చిన ఆహారం తీసుకోమని తెలిపారు.
SKLM: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాసం చివరి గురువారం పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమార్చన, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శత కలశ అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సూర్యనారాయణ తెలిపారు.
వరుస సెలవులు రావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకూ లైనులో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో భక్తులు ఇవాళ ఉదయం సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించాలని మైక్సెట్లలో విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం ద్వాదశి: రా. 1-14 తదుపరి త్రయోదశి విశాఖ: రా. 7-58 తదుపరి అనూరాధ వర్జ్యం: రా. 12-17 నుంచి 2-01 వరకు అమృత ఘడియలు: ఉ. 10-19 నుంచి 12-04 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-43 నుంచి 9-27 వరకు తిరిగి మ. 12-22 నుంచి 1-06 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 6.32; సూర్యాస్తమయం: సా.5.29.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు భక్తుల నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.1,73,903 ఆదాయం లభించిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా 330 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని తెలిపారు.
SRD: మండల పూజా మహోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు పుష్పాలకు పూజలు చేసి స్వామివారికి సమర్పించారు. పుష్పాలను అయ్యప్పస్వామికి ప్రత్యేకంగా అలంకరించారు.
CTR: వాల్మీకిపురంలోని కోనేటి వీధిలో ఉన్న శివాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, అర్చనలు, విశేషాలంకరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ATP: పెద్దవడుగూరు మండలంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకములు, విష్ణు అష్టోత్తర శతనామావళి, పలు పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.
TG: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేక పూజలు, ఏకాదశ లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల నమో నారసింహ, గోవింద నామస్మరణలతో యాదగిరులు మార్మోగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ASR: జీకేవీధి మండలం సీలేరు శ్రీ మారెమ్మ అమ్మవారికి తుని పట్టణానికి చెందిన కొరసాల సాయివినీల్ కాంత్, జాస్మిన్ దంపతులు గురువారం వెండి కిరీటాన్ని వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దామోదర శర్మ మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించారు.
శబరిమలలో రేపు అయ్యప్ప మండల పూజ నిర్వహించనున్నారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మధ్యాహ్నం 12 నుంచి 12:30 గంటల మధ్య శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కందారరు రాజీవారు మండల పూజను నిర్వహిస్తారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కేరళీయులు పెద్దసంఖ్యలో మండల పూజకు వచ్చే అవకాశం ఉంది. దీంతో NDRF బృందాలు భారీగా మోహరించాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు. తదుపరి రోజులకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలోని నీలంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ నాగ మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ధనుర్మాస బుధవారాన్ని పురస్కరించుకొని ఆలయ పూజారి అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా హాజరై స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో వివిధ సేవల ద్వారా రూ.2,49,310 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణరాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 476 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 1960 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
టీటీడీకి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి ఇచ్చారు. అయితే, ఇటీవల తిరుపతికి చెందిన ఓ వ్యాపారి స్వామివారికి రూ.కోటి అందజేసిన విషయం తెలిసిందే.