ప్రకాశం: అద్దంకి పట్టణంలో వేంచేసియున్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానం 53వ దసరా నవరాత్రులు సందర్భంగా.. 53 కిలోల లడ్డూను అద్దంకి పట్టణానికి చెందిన భక్తులు వూటుకూరి సుబ్బరామయ్య, వారి సోదరులు గురువారం అమ్మవారికి సమర్పించారు.
SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అశ్వయుజ శుద్ధ అష్టమి నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు దుర్గాష్టమి మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం పురవీధుల గుండా నంది గరుత్మంతుడు వాహనాలపై విహరించనున్నారు.
WG: శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు సందర్బంగా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వెంచేసియున్న భవానమ్మ అమ్మవారిని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు వట్టి పవన్, ఆలయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
E.G: మండపేటలోని కలువపువ్వు సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో గురువారం చండి హోమం నిర్వహించారు. శ్రీ దేవీ నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ కనకదుర్గ దేవి ఆలయం అర్చకులు అయినవిల్లి రుద్ర శర్మ ఆద్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
KDP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఖాజీపేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వాసవీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సభ ప్రతినిధులు గంగాధర్ రెడ్డి, ఆయన సతీమణి సుధామణిని సన్మానించారు. దంపతులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సత్యసాయి: తిరుపతి వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం ఉదయం సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనను వేదపండితులు ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. కదిరి నియోజకవర్గ ప్రజానీకం సుఖ: సంతోషాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని మంగళ గౌరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎనిమిదవ రోజు గురువారం మంగళ గౌరీ దేవిని దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని ఆలయ పండితులు తెలిపారు.
BPT: దసరా నవరాత్రుల మహోత్సవంలో భాగంగా గురువారం బండ్లమ్మ తల్లి మహా దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గురువారం ఉదయం అష్టోత్తర పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సన్నిధిలో నిర్వహించే అష్టోత్తర నిత్య కళ్యాణ పూజలలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.
ఎన్టీఆర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీ కనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి భక్తులకు అమ్మవారిని దర్శంచుకునేందుకు క్యూలైన్లో వేచి చూస్తున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి మరోవైపు భవానీలు కూడా భారీ స్థాయిలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులలు.
KDP: పులివెందుల గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో దసరా ఉత్సవాలలో భాగంగా.. బుధవారం శ్రీ అంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేశారు. అనంతరం శ్రీ దుర్గా హోమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ కాశీభట్ల గోపీనాథ్ శర్మ పర్యవేక్షణలో వేద విద్యా ప్రవీణ సతీశ్ శ్రీకాంత్ శాస్త్రిల ఆధ్వర్యంలో ఈ హోమాలను నిర్వహించారు.
GNTR: శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం (శివాలయం)లో బుధవారం అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ, అర్చకులు శ్యామసుందర శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్య పరులుగా పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం శాస్త్రి, కుటుంబసభ్యులు వ్యవహరించారు.
TPT: చంద్రగిరి పట్టణంలోని మూలస్థానం ఎల్లమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం అశ్వవాహనంపై గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. విజయ్ భాస్కర్ రెడ్డి, మునిరెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జయపాల్ రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు.
CTR: నగరిలో చావడి వద్ద ఉన్న శివాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం కామాక్షి అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు దుర్గా ప్రకాశ్ స్వామి ఉభయదారులు చేత కుంకుమార్చన వైభవంగా జరిపించారు.