KRNL: బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో గురువారం శ్రీఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు కొనసాగాయి. ఇందులో భాగంగానే ప్రాతఃకాల సమయం నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు తదితర పూజ క్రతువులను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ నిర్వహించి విశేష పూజలు జరిపారు.
JGL: ధర్మపురి గోదావరి తీరంలో గల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో గురువారం ఉదయం ధనుర్మాసం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సీతారాముల మూల విగ్రహాలకు అర్చకులు తాడూరి రఘునాథ శర్మ వేదోక్తంగా పంచామృతాలతో క్షీరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకరణ స్వామివారి అష్టోత్తర శతనామార్చనలు నివేదన మంగళ హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.
GNTR: పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కొలువైన శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉపాయంలో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షలు విరమించనున్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.
BDK: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటి పాలెం సమీపానగల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించి, పూజలు చేశారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ATP: గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో అమ్మవారికి అష్టోత్తర, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
GDWL: గద్వాల భీమ్ నగర్లో వెలిసిన సంతాన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నట్లు దేవాలయ ధర్మకర్తలు విక్రమ్ సింహా రెడ్డి, సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. ఈనెల 21న ఉత్సవాలకు అంకురార్పణ, 22న పల్లకి సేవ, రాత్రికి రథోత్సవం, 23న పారువేట, నాగవళి, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయన్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం తదియ: మ. 11-55 తదుపరి చవితి పుష్యమి: తె. 3-27 తదుపరి ఆశ్లేష వర్జ్యం: ఉ. 11-10 నుంచి 12-48 వరకు అమృత ఘడియలు: రా. 8-56 నుంచి 10-34 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-34 నుంచి 12-18 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 6.28; సూర్యాస్తమయం: సా.5.25 సంకటహర చతుర్థి
RR: తలకొండపల్లి మండలం రాంపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో చక్ర తీర్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో, 17 డిసెంబర్ 2024 రోజు ఉదయం, అయ్యప్ప మాలదారులు అయ్యప్ప స్వామి వారికి, ఆలయ అర్చకులు మధుసూదన శర్మ చేత అభిషేకం చేయించారు. తదుపరి స్వామి వారిని చందనం, పూలమాలతో, చక్కగా అలంకరించారు. 18 మెట్లపై పూలు పెట్టి, దీపారాధన చేశారు. అనంతరం స్వామివారిని పూజించి, హారతులు ఇచ్చారు.
BDK: భద్రాచలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి DEC 31 నుంచి 2025 JAN 20 వరకు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రామయ్య తన దశావతారాలలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తారు. DEC 31న మత్స్యావతారం, జనవరి 1న కూర్మావతారం, 2న వరాహావతారం, 3న నరసింహావతారం, 4న వామనావతారం, 5న పరుశురామావతారం, తదితర అవతారాలు దర్శనం ఇవ్వనున్నారు.
GDWL: గద్వాల మండలం జమ్మిచెడు గ్రామంలో వెలసిన నడిగడ్డ ఇలవేల్పు దైవం జమ్మిచేడు జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని నదీ జలాలతో అభిషేకించి అర్చన, ఆకు పూజ,హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
AP: శ్రీవారి దర్శనం కోసం 2025 మార్చి నెల కోటా టికెట్లను రేపు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. రేపు సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన ఆర్జిత సేవా టికెట్లు, 21న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు విడుదలవుతాయి. 23న అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు కోటా, వృద్ధులు, దివ్యాంగుల కోటా రీలీజ్ చేస్తారు. 24న రూ.300 టికెట్లు, అద్దె గదులు బుక్ చేసుకోవచ్చు. 27న శ్రీవారి సేవా కోటా టికెట్లు...