• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,864 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,348 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

March 22, 2026 / 07:25 AM IST

మార్చి 22: ఆదివారం పంచాంగం

➠ తిథి: చవితి: రా. 12-08 తదుపరి పంచమి ➠ నక్షత్రం: భరణి: రా. 1-33 తదుపరి కృత్తిక ➠ శుభ సమయాలు: ఉ.7:04-10:04, ఉ.11:04-మ.11:58, మ.2:04-4:28 ➠ రాహుకాలం: సా.4:30-సా.6.00 వరకు ➠ యమగండం: మ.12:00-మ.1:30 వరకు ➠ దుర్ముహూర్తం: సా.4:29-సా.5:17 వరకు ➠ వర్జ్యం: ఉ.11:57-మ.1:28 ➠ అమృత ఘడియలు: రా.8:59-10:29 వరకు.

March 22, 2026 / 01:12 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,008 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,001 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

March 21, 2026 / 08:06 AM IST

రాములోరి పెళ్లికి చీరాల గోటి తలంబ్రాలు

TG: భద్రాచలంలో శ్రీరామనవమి రోజున జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవంలో గోటి తలంబ్రాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ తలంబ్రాలను AP చీరాల నుంచి భక్తులు పంపిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో తొలిసారి 500 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ 25 వేల కిలోల వరకు పంపుతూ స్వామి సేవలో పునీతులవుతున్నారు. వీటిని కల్యాణంలో వినియోగించిన తర్వాత భక్తులకు పంపిణీ చేస్తారు.

March 21, 2026 / 07:36 AM IST

టీటీడీకి రూ.20 లక్షల విరాళం

TG: హైదరాబాద్‌కు చెందిన సృజన్ జ్యువెలరీ అధినేత రవికుమార్ తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు అన్నప్రసాద సేవలను విస్తరించే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు మరో రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. విరాళం అందించిన దాతకు బీఆర్ నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

March 19, 2026 / 01:55 PM IST

భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

TG: వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉగాది పండగ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భద్రకాళి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

March 19, 2026 / 12:05 PM IST

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

AP: వీరశైవ సంప్రదాయంలో శివుడిని వీరభద్రుడి రూపంలో కన్నడిగులు ఆరాధిస్తారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా అమావాస్య ఘడియలను పురస్కరించుకొని వారు శ్రీశైలంలో అగ్నిగుండ ప్రవేశం, వీరాచార విన్యాసాలు నిర్వహించారు. వీరభద్ర నామాలను స్మరిస్తూ శూలాలను తమ చెంపలు, పెదవులు, నాలుక, చేతులకు గుచ్చుకొని భక్తిని ప్రదర్శించారు. వీరభద్రుని ఆవేశానికి ప్రతీకగా ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేశారు.

March 19, 2026 / 10:35 AM IST

‘ఉగాది’ అంటే ఏమిటీ?

ఉగాది అంటే పచ్చడి తినడమే కాదు, ప్రకృతితో మమేకమయ్యే అద్భుతమైన వేడుక. చాలామందికి ‘ఉగాది’ పేరు వెనుక ఉన్న అర్థం తెలియదు. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షు లెక్క మొదలయ్యే రోజే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కలియుగం ప్రారంభమైందని పెద్దలు చెబుతారు. అందుకే, ఇది తెలుగు వారికి పండుగ మాత్రమే కాదు.. కొత్త బిగినింగ్.

March 19, 2026 / 09:40 AM IST

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతుండగా.. 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,332 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

March 19, 2026 / 08:36 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉగాది ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి రానున్నారు. మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేపు, ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయనున్నారు.

March 19, 2026 / 08:23 AM IST

భద్రాచలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

TG: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీన ముగియనున్నాయి. ఈనెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానుండగా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

March 19, 2026 / 07:25 AM IST

చెడు లక్షణాల ఓటమే పరాభవ!

తెలుగు సంవత్సరాల్లో పరాభవ 40వది. ఈ ఏడాది పేరు పరాభవ. మనలోని అరిషడ్వర్గాలను జయిస్తే పరాభవమన్నది ఉండదని ఈ ఉగాది సందేశం. పరాభవ అంటే ఓడిపోవడం, అపజయం అనుకుంటున్నప్పటికీ.. బాహ్యప్రపంచంలో ఓడిపోవడం అనేది కాదు. బయటి శత్రువుల కంటే మనలోని చెడు ఆలోచనలను ఓడించడానికి ఈ ఏడాది సరైనది. అహంకారాన్ని విడనాడి, సత్యం, ధర్మం వైపు సాగేవారికి ఈ సంవత్సరం గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది.

March 19, 2026 / 07:13 AM IST

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్!

AP: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటా ఇవాళ్టి నుంచి విడుదల కానుంది. ఉ.10 గంటల నుంచి ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి టికెట్లు, 23న అంగప్రదక్షిణ టోకెన్లు, 24న రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

March 18, 2026 / 07:07 AM IST

పూర్వజన్మ సుకృతం: బీఆర్ నాయుడు

AP: తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శుద్ధి కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. ఆనంద నిలయం నుంచి ఆలయ ప్రాకారాల వరకు ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర ద్రావణంతో శుద్ధి నిర్వహించామన్నారు.

March 17, 2026 / 11:15 AM IST

శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

AP: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఏడాదికి నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ఆలయం శుద్ధి చేస్తామన్నారు. ఆలయ మూలమూర్తికి వస్త్రం కప్పి ఉప ఆలయాలను శుద్ధి చేశామన్నారు. శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పిస్తామన్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

March 17, 2026 / 09:23 AM IST