• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

కనిగిరిలో ఈశ్వరిదేవికి పూజలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని దొరువు వద్ద గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో ఈశ్వరిదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. జగన్మాత ఈశ్వరిదేవి 235వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈశ్వరి దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.

December 24, 2024 / 12:57 PM IST

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న నగర మేయర్

VSP: విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారిని నగర మేయర్ హరి వెంకట కుమారి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మేయర్ దంపతులకు ఆలయాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

December 24, 2024 / 12:38 PM IST

నేటి నుంచి అయ్యప్ప స్వామి మండల పూజలు

HYD: బోరబండ సైట్- 2 కాలనీలోని హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవస్థానంలో వార్షిక మండల పూజలు మంగళవారం ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ జి. లక్ష్మణ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి హోమం, అయ్యప్పస్వామికి అభిషేకం, లక్ష పుష్పార్చన, 108 కలశాలతో రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ఉంటాయన్నారు. భక్తులు పాల్గొనవచ్చునన్నారు.

December 24, 2024 / 06:32 AM IST

తిరుమల అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

AP: తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఈవో, అదనపు ఈవో అభినందించారు.

December 24, 2024 / 03:31 AM IST

డిసెంబర్ 24: మంగళవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం నవమి: రా. 7-15 తదుపరి దశమి; హస్త: మ. 12-31 తదుపరి చిత్త వర్జ్యం: రా. 9-23 నుంచి 11-09 వరకు; అమృత ఘడియలు: ఉ. 7-38 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-42 నుంచి 9-26 వరకు తిరిగి రా. 10-41 నుంచి 11-33 వరకు; రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 6.31; సూర్యాస్తమయం: సా.5.28.

December 24, 2024 / 01:18 AM IST

యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల సందడి

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలొచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే, స్వర్ణగిరి ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది.

December 22, 2024 / 01:10 PM IST

మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో పూజలు చేసిన భక్తులు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో భక్తులు ఆదివారం తెల్లవారుజాము పోటెత్తారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 

December 22, 2024 / 09:26 AM IST

కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండోరోజు భవానీ దీక్షల విరమణ కొనసాగుతుంది. భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 25 వరకు ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేశారు.

December 22, 2024 / 08:22 AM IST

BREAKING: శబరిమల భక్తులకు అలర్ట్

కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల నియంత్రణకు కేరళ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 25, 26వ తేదీల్లో పరిమితంగా వర్చువల్, స్పాట్ బుకింగ్స్ సౌకర్యం కల్పించనుంది. 25న 50 వేల మంది, 26న 60 వేల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.

December 22, 2024 / 07:09 AM IST

డిసెంబర్ 22: ఆదివారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం సప్తమి: మ. 3-13 తదుపరి అష్టమి పుబ్బ: ఉ. 7-41 తదుపరి ఉత్తర వర్జ్యం: మ. 3-34 నుంచి 5-19 వరకు అమృత ఘడియలు: రా. 2-05 నుంచి 3-50 వరకు దుర్ముహూర్తం: సా. 3-59 నుంచి 4-43 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.30; సూర్యాస్తమయం: సా.5.27

December 22, 2024 / 04:00 AM IST

శనీశ్వరాలయంలో తిల తైలాభిషేక పూజలు

NGKL: బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ శ్రీ సార్థసప్త జేష్టమాతా సమేత శనీశ్వరస్వామికి శనివారం భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. అర్చకులు విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి నువ్వులు, జిల్లేడు పూలు, నువ్వుల నూనె, జిల్లేడు పూలు సమర్పించి తిల తైలాభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని పరమశివుని దర్శించుకుని అభిషేక పూజలు చేశారు.

December 21, 2024 / 04:36 PM IST

దనుర్మాసం సందర్భంగా వెంకన్నకు విశేష పూజలు

AKP: దనుర్మాస వేడుకల్లో భాగంగా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకన్నకు శనివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకుని గోవింద నామస్మరణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు.

December 21, 2024 / 11:29 AM IST

ప్రసన్న వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస పూజలను ప్రత్యక్షంగా వీక్షించుటకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామిని కనులారా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది

December 21, 2024 / 11:02 AM IST

భక్తులతో కిటకిటలాడుతున్న తిమ్మప్ప ఆలయం

GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని తిమ్మప్ప స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి తెల్లవారుజాము నుంచే తిమ్మప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు ధ్వజ స్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టి ముడుపులు చెల్లించుకున్నారు.

December 21, 2024 / 11:01 AM IST

వైభవంగా ధనుర్మాస పూజలు

SRPT: సిరిపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. శనివారం ఆరో రోజు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకు పూజతో పాటుగా, గోదాదేవి అమ్మవారికి కుంకుమ సహస్రనామార్చన, తిరుప్పావై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. జనవరి 14న గోదా కళ్యాణంతో పూజలు ముగుస్తాయని అర్చకులు వేదాంతం చక్రధరాచార్యులు తెలిపారు.

December 21, 2024 / 09:07 AM IST