శ్రీరామనవమి వేడుకలకు దేశం ముస్తాబైంది. కొన్నాళ్ల క్రితం రాములోరి కల్యాణం అయ్యే వరకు ఇళ్లలో పెళ్లిళ్లు జరిగేవి కావు. కల్యాణం తర్వాతనే ముహూర్తాలు పెట్టుకునే వారు. అయితే, రామయ్య కల్యాణ తలంబ్రాలను ఇంట్లో వివాహం కాని యువతీ యువకుల శిరస్సు పైన వేసినట్లయితే వారికి వివాహం అవుతుందని నమ్ముతారు. పెళ్లి కానివారు ఈ ఆచారాన్ని పాటిస్తే.. త్వరగా వివాహం అవుతుందట.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,411 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,474 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం అష్టమి: మ.2-42 తదుపరి నవమి; ఆర్ద్ర: రా.7-05 తదుపరి పునర్వసు వర్జ్యం: లేదు; అమృత ఘడియలు: ఉ.9-42 నుంచి 11-12 వరకు దుర్ముహూర్తం: ఉ.10-04 నుంచి 10-52 వరకు; తిరిగి మ.2-53 నుంచి 3-42 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6.03; సూర్యాస్తమయం: సా.6.07.
AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన ఒంటిమిట్ట ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ‘హరిద్రా ఘటనం’ (పసుపు దంచే కార్యక్రమం)తో ఈ వేడుకలు ప్రారంభించారు. APR 1న సా.6:30 గంటలకు సీతారామ కళ్యాణోత్సవం ప్రారంభంకానుంది.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం సప్తమి: సా.4-58 తదుపరి అష్టమి; మృగశిర: రా.8-36 తదుపరి ఆర్ద్ర; వర్జ్యం: తె.4-28 నుంచి 5-58 వరకు; అమృత ఘడియలు: మ.12-24 నుంచి 1-54 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-41 నుంచి 12-29 వరకు; రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6.04; సూర్యాస్తమయం: సా.6.07.
TG: నల్లమల అడవుల్లో ‘తెలంగాణ అమర్నాథ్’గా పేరుగాంచిన సలేశ్వరం జాతర APR 2 నుంచి 6వ తేదీ వరకు జరగనుంది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో జాతర జరుగుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వెయ్యి అడుగుల లోతు లోయలో ఉన్న లింగమయ్యను దర్శించుకోనున్నారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.
పరాభవ నామ సం.; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం షష్ఠి: రా.7-24 తదుపరి సప్తమి; రోహిణి: రా.10-16 తదుపరి మృగశిర; వర్జ్యం: మ.2-50 నుంచి 4-19 వరకు; తిరిగి తె.3-29 నుంచి 4-58 వరకు; అమృత ఘడియలు: రా.7-18 నుంచి 8-47 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-29 నుంచి 9-17 వరకు; తిరిగి రా.10-54 నుంచి 11-42 వరకు; రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6.05; సూర్యాస్తమయం: సా.6.07.
AP: తిరుమల శ్రీవారిని దర్శించుకొవాలనుకునే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ లో స్వామివారిని దర్శించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.
చైత్ర శుద్ధనవమి రెండు తేదీల్లో ఉండటంతో.. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం భక్తుల్లో నెలకొంది. దీని దృష్ట్యా శ్రీరామనవమి మార్చి 27న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే నవమి మార్చి 26న 2.18pmకు ప్రారంభమై 27న 12.36pm వరకు ఉంది. అందుకే 27న శ్రేష్ఠమని సూచిస్తున్నారు. భద్రాచలం రాములోరి కళ్యాణం కూడా మార్చి 27నే జరుగుతుంది.
తిరుమలలో ఈ నెల 30 నుంచి 3 రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఈ రోజుల్లో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలను TTD రద్దు చేసింది. 30న స్వామి తన దేవేరులతో మాడవీధుల్లో విహరించి, వసంత మండపానికి చేరుకుంటారు. 31న బంగారు రథంపై ఊరేగింపు, వసంతోత్సవం.. చివరిరోజున స్వామి, సీతారామలక్ష్మణాంజేయులతో పాటు రుక్మిణీ సమేత కృష్ణుడితో ఉత్సవంలో పాల్గొంటారు.
గ్యాస్ కొరతతో తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ నిలిచిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గడంతో మూడేళ్లుగా ఇస్తున్న ఉచిత లడ్డూల తయారీకి బ్రేక్ పడింది. అయితే భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే కట్టెల పొయ్యిపై లడ్డూలు చేసి పంపిణీ చేయనున్నారు.
TG: భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి వారి పెళ్లి వేడుకలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ ఏర్పాట్లతో భద్రగిరి ప్రత్యేక శోభను సంతరించుకుంది. పెళ్లి వేడుక ఏర్పాట్లతో పురవీధులు కాంతులీనుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన సీతారాముల కల్యాణం, మహాపట్టాభిషేకం ఈనెల 27, 28వ తేదీల్లో జరగనున్నట్లు ఆలయ పండితులు వెల్లడించారు.
AP: శ్రీశైల క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 30 రోజుల వ్యవధిలోనే రూ.7.19 కోట్లకు పైగా కానుకలు లభించాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.7,19,58,064 నగదు లభించినట్లు వెల్లడించారు. నగదుతో పాటు 122 గ్రా. బంగారం, 6 కిలోల 550 గ్రా. వెండిని భక్తులు సమర్పించారు. వీటితో పాటు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించాయి.