• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

‘మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌నే పూజించాలి’

VSP: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమార్ స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ‌లోని ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ శుక్ర‌వారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్ల‌డారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే ప్రతిమలను వాడొద్దని సూచించారు.

August 22, 2025 / 03:22 PM IST

మండపేట పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

కోనసీమ: శ్రావణమాసం 5వ శుక్రవారం సందర్భంగా మండపేటలోని ఏడిద రోడ్ లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అమ్మవారికి పలు రకాల వంటలతో పాటు వస్త్రాలు, గాజులతో సారె పెట్టారు. ఆనంతరం భారీ ఆన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

August 22, 2025 / 03:21 PM IST

కదిరిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

సత్యసాయి: కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వ్రతం సామాగ్రి అందజేసి విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి ప్రసాదం అందజేసి భక్తులను ఆశీర్వదించారు.

August 22, 2025 / 02:50 PM IST

కసాపురం ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి ఆలయ ఈవో విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.

August 22, 2025 / 02:00 PM IST

శ్రీ ఈరన్న స్వామిని దర్శించుకున్న నరవ దంపతులు

KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహా ఈరన్నస్వామిని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. నరవ దంపతులు శ్రీ ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

August 22, 2025 / 01:21 PM IST

భవాని మాతగా రామలింగేశ్వర స్వామి దర్శనం..

MLG: వెంకటాపుర్ (M) రామప్ప దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా రామలింగేశ్వర స్వామి భవాని మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున స్వామివారికి అభిషేకాలు నిర్వహించగా, ఆలయ అర్చకులు హరీశ్ శర్మ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

August 22, 2025 / 12:55 PM IST

శాకంబరీ అమ్మవారి అలంకరణలో శ్రీ పైడితల్లమ్మ

VZM : జిల్లా ప్రజలకు ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు వివిధ రకాల కాయగూరలతో శాకంబరీ అమ్మవారిగా అలంకరించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

August 22, 2025 / 11:10 AM IST

చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చిన వెంకయ్య స్వామి

NLR: వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి 43వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం స్వామివారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

August 22, 2025 / 09:25 AM IST

పులివెందులలో సీతారాముల కళ్యాణం

KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కే.వెలమవారిపల్లిలో శ్రీ సీతారామ, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజ స్తంభ ప్రతిష్టాపనోత్సవం హోమాలను నిర్వహించారు. అనంతరం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు.

August 21, 2025 / 04:01 PM IST

కనకమహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ లక్ష్మి పూజలు

VSP: విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రావణ లక్ష్మీ పూజలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ పూజలలో 80 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో లక్ష్మీవారంగా భావించే గురువారం రోజున అధిక సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

August 21, 2025 / 03:13 PM IST

ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని దిరశవంచ పంచాయతీలో చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టీడీపీ మండల నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసుల రెడ్డి, పోల్ రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు.

August 21, 2025 / 03:01 PM IST

సింహాచలంలో పునర్వసు హోమం

VSP: విశాఖలోని సింహాచలం ఆలయంలో పునర్వసు హోమం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఉప ఆలయమైన రామాలయంలో శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వీ.త్రినాథరావు ఆదేశాల మేరకు.. ఆలయ స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు ఈ హోమాన్ని నిర్వహించారు.

August 20, 2025 / 10:04 PM IST

కనకమహాలక్ష్మీ అమ్మవారి హుండీల లెక్కింపు

VSP: విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 69 రోజులకు అనగా బుధవారం హుండీలను లెక్కించారు. రూ.46,53,301 బంగారం 84.9 గ్రాములు, వెండి 795 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఉపకమిషనరు కార్యనిర్వాహణాధికారిణి కే.శోభారాణి, దేవదాయ శాఖ సహాయ కమీషనర్ టీ.అన్నపూర్ణ పాల్గొన్నారు.

August 20, 2025 / 09:09 PM IST

కొల్లాపురమ్మ దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KRNL: చిప్పగిరి మండలం నేమకలు గ్రామంలో శ్రీ కొల్లాపురమ్మ దేవి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి హాజరయ్యారు. అనంతరం శ్రీ కొల్లాపురమ్మ దేవిని దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటి సభ్యులు పాల్గొన్నారు.

August 20, 2025 / 04:47 PM IST

ఘనంగా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

VKB: పరిగి పట్టణంలోని శ్రీశ్రీ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి-ఉమారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, స్వామివారికి అభిషేకం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోమం, అంజనేయ, నాగ, ధ్వజ హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.

March 11, 2025 / 04:15 PM IST