SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లో భక్తులు వేచి చూశారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
CTR: చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆలయ విశిష్టతను నిర్ధారిస్తూ ఐసీయల్ (ICL) సంస్థ ISO ధృవీకరణ పత్రాన్ని అందించింది. ఈ మేరకు దేవస్థాన ఉప కమీషనరు, కార్యనిర్వాహణాధికారి J. ఏకాంబరం సంస్థ ప్రతినిధులు రామలక్ష్మి చేతుల మీదగా పత్రాన్ని అందుకున్నారు. అనంతరం వారికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.
MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు సోమవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందువాసరే పురస్కరించుకొని ఆలయ ఆచార సాంప్రదాయ పద్ధతిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో వేదోక్తంగా అభిషేకం పూజలు చేపట్టారు. మహా మంగళహారతి నిరాజనం నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
KDP: సుండుపల్లె మండల పరిధిలోని తిమ్మసముద్రం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మండపం వద్ద అర్చక స్వామి, వేద పండితులు హోమ పూజలు చేయించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక పూలమాలలతో అలంకరించి పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
EG: అంబాజీపేట శివారు కొత్తపాలెంలోని సరస్వతి దేవికి రాయుడు వెంకట రమణ, విజయ మంగాలక్ష్మి దంపతులు ఆదివారం వెండి వీణను సమర్పించారు. సుమారు రూ.1.25 లక్షలు విలువ చేసే వెండితో చేయించిన ఈ వీణను రమణ దంపతులు కమిటీ సభ్యులకు అందజేశారు.అంతకు ముందు వెండి వీణకు సంప్రోక్షణ చేసి,ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.అనంతరం వీణను అమ్మవారి చేతుల్లో అలంకరించారు.
KDP: సిద్దవటం మండల కేంద్రంలోని నిత్యపూజ స్వామి ఆలయం తరుపున వేలంపాట నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి తెలియజేశారు. కార్తీక మాస ఉత్సవంలో భక్తులు సమర్పించే తలనీలాల కొరకు వేలంపాట ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేలంపాటను అక్టోబర్ 15వ తేదీన సిద్దవటంలోని రంగనాయక స్వామి దేవాలయంలో బహిరంగ వేలం వేస్తామని చెప్పారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం ద్వాదశి: రా. 12-23 తదుపరి త్రయోదశి శతభిష: రా. 10-28 తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: ఉ. 6-34 నుంచి 8-05 వరకు తిరిగి తె. 4-28 నుంచి అమృత ఘడియలు: మ. 3-39 నుంచి 5-10 వరకు దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2-30 నుంచి 3-17 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.56; […]
GNTR: చేబ్రోలు మండలంలోని కొత్త రెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన దసరా ఉత్సవాల్లో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మురళీకృష్ణకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
GNTR: విజయదశమి వేడుకలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆదివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో టీడీపీ నాయకుడు అనిల్ కుమార్ అమ్మవారి లడ్డూను రూ.45వేలకు దక్కించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఆయనకు లడ్డూను అందించారు. ఈ సందర్భంగా అనిల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పూజలు చేశారు.
ATP: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆశ్రమం వీధిలో శ్రీదుర్గా భవాని మాతకు శనివారం రాత్రి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భూమాను శాలువాతో సత్కరించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ 18వ వార్డు ఇన్ఛార్జ్ సగిలి శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చాంద్ బాషా, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
CTR: తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శనివారం రాత్రి జరిగిన విజయదశమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలోని సాయి సత్సంగ నిలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. సాయి సత్సంగ నిలయం నిర్వహకులు కోట సునీల్ కుమార్, ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
కృష్ణ: నాగాయలంకలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం విజయ దశమి సందర్భంగా అమ్మవారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే అల్లుడు అశ్విన్ కుమార్, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత విచ్చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.
CTR: జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట, ముండ్లపాడు, మంగోల్లు గ్రామాలలో దేవి నవరాత్రుల ఉత్సవాలతో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవార్లను విజయదశమి సందర్భంగా జనసేన నాయకులు సామినేని ఉదయభాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ: కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలో శనివారం శ్రీ కోదండ రామాలయంలో స్వామివార్లకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెండి కిరీటాలను బహుకరించారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
EG: కాకినాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద విజయదశమి పండుగను పురస్కరించుకుని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయుధ పూజను నిర్వహించారు. ఈ మేరకు వేద పండితుల వేదమంత్రాలు నడుమ ఆయన విజయ కనకదుర్గమ్మ అమ్మవారికి పూజలను నిర్వహించారు. అదేవిధంగా ఆయుధ పూజలు చేశారు. అనంతరం పోలీస్ వాహనాలకు పూజలు చేపట్టారు.