• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

పెంచలకోనలో విశేష పూజలు

NLR: రాపూర్ మండలంలోని పెంచలకోనలో శనివారం శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అమ్మవార్లకు వేద పండితులు, మంత్రోచ్ఛణల మధ్య కల్యాణ కార్యక్రమం ఘనంగా సాగింది. శనివారం కావడంతో భక్తుల గోవింద నామస్మరణలతో పెంచలకోన క్షేత్రం మారు మ్రోగింది. భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.

October 19, 2024 / 05:46 PM IST

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు పూజలు జరగనున్నాయి. చివరిరోజు పడితో దర్శనాలు ముగియనున్నాయి. జనవరి 14 మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కలగనుంది. కాగా, మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కాకముందు నుంచే శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు పోటెత్తడంతో తీవ్ర తోపులాట, […]

October 19, 2024 / 04:45 PM IST

స్వామివారి సేవలో ఎక్సైజ్ శాఖ కమిషనర్

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నితీష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాహు, కేతు పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేశారు.

October 19, 2024 / 03:53 PM IST

భక్తులతో కిక్కిరిసిన మద్దిలేటి నరసింహస్వామి ఆలయం

NDL: మండల పరిధిలోని రంగాపురం గ్రామ సమీపంలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామునుంచి ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, వరపూజ, మహా మంగళహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

October 19, 2024 / 01:28 PM IST

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టిందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని, 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తెలిపారు. శుక్రవారం 61,576 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 23,412 మంది తలనీలాలు సమర్పించారన్నారు. కానుకల రూపంలో రూ.3.54 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది.

October 19, 2024 / 10:57 AM IST

ప్రత్యేక పూజలు అందుకున్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి

SRD: రాయికోడ్ మండల కేంద్రంలో కొలువుదీరిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అశ్వయుజ మాసం, కృష్ణ పక్షం, విదియ, స్థిర వాసరే పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, సుగంధ పరిమళ పుష్పాలంకరణ, పట్టు వస్త్రాలు సమర్పించి మహా మంగళ హారతి నైవేద్య నివేదన చేశారు.

October 19, 2024 / 08:51 AM IST

వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్య క్షేత్రంలో వన దుర్గ భవాని మాతకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో రుత్వికులు స్థిర వాసరే పురస్కరించుకొని మూలమూర్తి దేవికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో వేదోక్తంగా విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

October 19, 2024 / 06:56 AM IST

శ్రీశైలం మల్లన్న దంపతులకు వైభవంగా ఊయలసేవ

NDL: శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లకు శుక్రవారం రాత్రి ఊయలసేవ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ వేదపండితులు, అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గణపతిపూజ, పుణ్యాహవాచనం, అలంకార హారతులు చేపట్టారు. లోకకళ్యాణం, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పూజలు చేపట్టినట్లు తెలిపారు.

October 19, 2024 / 06:49 AM IST

కుంభాభిషేక మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే

KDP: ముద్దననూరు మండలంలోని కె.తిమ్మాపురం గ్రామంలో శ్రీ ఆత్మారామస్వామి, శ్రీ గణపతి ధ్వజ, శిఖర పునఃప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా EX’MLA’ సుధీర్ రెడ్డికి పురోహితులు ఘన స్వాగతం పలికి ఆయన సన్మానించారు. అనంతరం తీర్ధప్రసాదాలు అందించారు.

October 19, 2024 / 05:29 AM IST

శ్రీకాళహస్తి మనోన్మని ప్రత్యేక ఊంజల్ సేవ

TPT: ముక్కంటి ఆలయంలో శుక్రవారం అమ్మవారైన మనోన్మనికి ప్రత్యేక ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానాంబిక ఆలయానికి ఎదురుగా ఉయ్యాలపై ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శుక్రవారం రాత్రి ఉత్సవ మూర్తిని ఆలయంలో ఊరేగించారు. అనంతరం అమ్మవారి సన్నిధి వద్ద దర్పణం ముందు ఉంచి ఆలయ అభిషేక గురుకుల్ సురేశ్ ధూప దీప నివేదనలు సమర్పించారు.

October 19, 2024 / 04:20 AM IST

శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు బదిలీ

AP: శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీశైలం ఆలయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న ఇ.చంద్రశేఖర్‌రెడ్డిని దేవస్థానం ఇంఛార్జి ఈవోగా నియమించింది.

October 19, 2024 / 04:04 AM IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 58,637 మంది భక్తులు దర్శించుకోగా.. 21,956 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.69కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

October 18, 2024 / 08:14 AM IST

అమ్మవారిని దర్శించుకున్న జగన్మోహన్ రాజు

KDP: వీరబల్లి మండలంలోని ఓదివీడు కన్పాకు సమీపంలో గల ప్రాచీన ఓదేటమ్మ ఆలయంలో గురువారం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఓదేటమ్మ ఆలయానికి వచ్చిన చమర్తికి గ్రామస్థులు పూలమాలతో సన్మానించారు.

October 17, 2024 / 11:36 AM IST

శ్రీవారి నడక మార్గం మూసివేత

AP: భారీ వర్షాల కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇవాళ శ్రీవారి నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గాన్ని TTD మూసివేసింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తులకు అనుమతిని అధికారులు రద్దు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిన...

October 17, 2024 / 04:56 AM IST

భక్తి శ్రద్ధలతో పౌర్ణమి పూజలు

CTR: నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు బుధవారం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి అభిషేకాలు అలంకరణ విశేషంగా జరిగింది. లోక కళ్యాణార్ధం నిర్వహించిన హోమంలో ఉభయదారులు జి.సరళ మరియు జి.మార్కొండేయులు పాల్గొన్నారు. దూప దీప నైవేద్యాలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందించారు.

October 16, 2024 / 02:45 PM IST