NLR: నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేకువ జామునే స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి, పలు రకాల పుష్పాలు, తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
KMR: లింగంపేట్లో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, జపాన్ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. అలాగే గుడిలో అన్నదాన కార్యక్రమానికి క్వింట బియ్యం అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. పైడి ఎల్లారెడ్డి మంచి మనసు కలిగిన వ్యక్తిగా మా మధ్యలో ఉండడం మా అదృష్టమని అన్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం పంచమి: రా. 1-11 తదుపరి షష్ఠి మూల: పూర్తి వర్జ్యం: మ. 1-13 నుంచి 2-51 వరకు తిరిగి తె. 4-50 నుంచి అమృత ఘడియలు: రా. 11-04 నుంచి 2-51 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-15 నుంచి 9-04 వరకు తిరిగి మ. 12-23 నుంచి 1-13 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5.45; సూర్యాస్తమయం: […]
కోనసీమ: ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి అన్నదాన భవన నిర్మాణానికి మంగళవారం గాజువాక వాస్తవ్యులు నూక వెంకట గణేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళంగా అందించారు. వీరికి ఆలయ అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి చరిత్ర గురించి వివరించారు. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు, సిబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.
W.G: భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి మందిరంలో జరిగే 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సోమవారం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి పౌర్ణమి పూజలను శనివారం వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవను చేశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల నందు చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు చేశారు.
NLR: సంగంలోని కామాక్షీ దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పులి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. హేమంత్ కృష్ణ అనే ప్రముఖ కళాకారుడు ముక్కుతో ఫ్లూట్ వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 33వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 18న అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకు లక్ష కుంకుమార్చన, 19న నవగ్రహ చండీ హోమం, అన్నసంతర్పణ, 20న బోనాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.
NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: మామిడికుదురు పెరెళ్ల కాలువ గట్టు వద్ద ఉన్న రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అర్చకులు సుదర్శనం వెంకట శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామికి తమలపాకులు, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.
SRCL: వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తుల పోటెత్తారు. సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.
ATP: అక్కమాంబ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయంలో కొలువైన శ్రీ అక్కమహాదేవి, పరమేశ్వరుడికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, వారి సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి పట్టు వస్త్రాలు అందించారు. పట్టు వస్త్రాలతో వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ ఛైర్పర్సన్ పద్మావతి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ATP: గుంతకల్లు కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం సాయంకాలం ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంలో కొలువు తీర్చి స్వామివారికి ఆలయ వాణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
AP: శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి భారీగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. పాదయాత్రగా కన్నడిగులు నల్లమల అడవుల నుంచి వస్తున్నారు. ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరపనున్నారు. భారీగా వస్తున్న భక్తుల రద్దీతో ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా రేపటి నుంచి 31 వరకు స్వామివారి స్పర్శదర్శనానికి అనుమతిలేదు.