NLR: కలువాయి మండలం కుల్లూరులో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతులు, చల్ల సీతారామ్, కమల ఆధ్వర్యంలో ఆలయం నూతనంగా నిర్మించారు. వడ్డెరల కుల ఆది గురువు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి జీ సారథ్యంలో ప్రత్యేక యజ్ఞ యాగాలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆలయ కొండకు ఇరువైపులా గిరి ప్రదర్శన చేశారు. ప్రతి ఏడాది మాఘపౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన చేస్తున్నట్లు వీరు తెలిపారు.
VSP: సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.
NLR: కందుకూరు పట్టణంలోని శతాబ్దాల నాటి ప్రాచీన ప్రసిద్ధి అంకమ్మ తల్లి దేవాలయంలో ఈనెల 12వ తేదీ ఏకాహం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు (ఏకాహం) లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏకాహంలో పాల్గొంటారని తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామిని మంగళవారం సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజామనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తికి పలు రకాల పుష్పాలు, తమలపాకుల తోరణాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 3,18,218 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 795 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 4,190 మంది భక్తులు అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కోష్ట జాతీయ రహదారి పక్క శ్రీ కృష్ణ చైతన్య మఠం వారి గోశాల, శ్రీ రాధా గోవిందా గోకులానంద ఆశ్రమంలో శ్రీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రతిష్ట కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తు శ్రీ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, సాధువులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
ATP: బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటరమణుడి మూల విరాట్ను భక్తులు పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రావణి భక్తులతో కలిసి పల్లకీని మోశారు.
PDPL: కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు, కాలేశ్వరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణింద్ర శర్మ అన్నారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి కరకమలములతో శతచండీ మహారుద్ర సహిత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.
KNRL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వసంత పంచమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనానికి వివిధ ఫలాలతో పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బృందావనానికి పూలు బంగారు కవచాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.
VSP: వన్ టౌన్ ప్రాంతంలోని 37వ వార్డులోని జంబల్ తోట ప్రాంతంలో గల వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయ వార్షికోత్సవ నేపథ్యంలో ఎమ్మెల్యే తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.
TPT: గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అలంకారాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గూడూరు గ్రామ శివారులో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
VZM: విజయనగరం స్థానిక బాబామెట్టలో గల శ్రీ శివ పంచాయతన దేవాలయంలో ఆదివారం మాఘ మాసం మొదటి వారం పర్వదిన సందర్భంగా అర్చకులు సుప్రభాత సేవ అనంతరం శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కేఏపీ రాజు, శివ, నారాయణ రావు, సాంబరాజ పాల్గొన్నారు.
ATP: పెద్దపప్పురు మండలం చిన్నపప్పురులో అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్థ రాత్రి నుంచే అశ్వర్థ నారాయణస్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పూలతో అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు.