AP: తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. ఓ భక్తుడు మోసపోయిన ఘటనలో TTD విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు TTD ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
శ్రీవిశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష నవమి: రా2-57 తదుపరి దశమి; రోహిణి: మ2-09 తదుపరి మృగశిర; వర్జ్యం: ఉ6-45 నుంచి 8-13 వరకు, తిరిగి రా7-24 నుంచి 8-54 వరకు; అమృత ఘడియలు: ఉ11-11 నుంచి 12-40 వరకు, తిరిగి తె4-23 నుంచి 5-53 వరకు; దుర్ముహూర్తం: ఉ11-50 నుంచి 12-36 వరకు; రాహుకాలం: మ12 నుంచి 1-30 వరకు; సూర్యోదయం: ఉ6-26; సూర్యాస్తమయం: సా6-01.
తిరుమల శ్రీవారి దర్శనం మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఇవాళ విడుదల కానున్నాయి. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు రిలీజ్ చేయనున్నారు. అలాగే, తిరుమల, తిరుపతి గదుల కోటాను కూడా విడదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తులు సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,506 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,049 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం షష్ఠి: ఉ.10-03 తదుపరి సప్తమి; భరణి: సా.5-33 తదుపరి కృతిక; వర్జ్యం: తె.4-45 నుంచి 6-14 వరకు; దుర్ముహూర్తం: మ.12-36 నుంచి 1-22 వరకు, తిరిగి 2-55 నుంచి 3-41 వరకు; రాహుకాలం: ఉ.7-30 నుంచి 9 వరకు; సూర్యోదయం: ఉ.6.27; సూర్యాస్తమయం: సా6 గంటలకు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం అన్నికంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
TG: యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీకృష్ణాలంకారంలో నరసింహస్వామి మురళీకృష్ణుడిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రాత్రికి స్వామివారికి పొన్న వాహనసేవ నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం పంచమి: మ.12:09 తదుపరి షష్ఠి; అశ్విని: రా.7:01 తదుపరి భరణి; వర్జ్యం: మ.3:13 నుంచి 4:45 వరకు; తిరిగి తె.4:02 నుంచి 5:32 వరకు; అమృత ఘడియలు: మ.12:11 నుంచి 1:42 వరకు; దుర్ముహూర్తం: సా.4:27 నుంచి 5:13 వరకు; రాహుకాలం: సా.4:30 నుంచి 6:00 వరకు సూర్యోదయం: ఉ.6:28; సూర్యాస్తమయం: సా.6:00.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం చవితి: మ.2:00 తదుపరి పంచమి రేవతి: రా.8:15 తదుపరి అశ్విని వర్జ్యం: ఉ.8:44 నుంచి 10:16 వరకు అమృత ఘడియలు: సా.5:57 నుంచి 7:29 వరకు దుర్ముహూర్తం: ఉ.6:28 నుంచి 8:00 వరకు రాహుకాలం: ఉ. 9:00 నుంచి 10:30 వరకు సూర్యోదయం: ఉ.6.28; సూర్యాస్తమయం: సా.5:59.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,020మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
TG: యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి.