• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బండి సంజయ్

HYD: చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీపావళి పండుగను పురస్కరించుకుని బండి సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

October 21, 2025 / 08:35 PM IST

రూ. 5 రూపాయల నాణేల మాలతో అమ్మవారికి అలంకరణ

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రూ. 5 రూపాయల నాణేలతో తయారు చేసిన మాలను అమ్మవారికి ధరించి ప్రత్యేక పూజలు చేశారు.

October 21, 2025 / 11:50 AM IST

భోగేశ్వరస్వామికి విశేష అలంకరణ

ATP: పామిడిలో వెలసిన భోగేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు అభిషేకాలు నిర్వహించి స్వామికి పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశామని అర్చకులు తెలిపారు.

October 21, 2025 / 11:20 AM IST

టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు

AP: తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చాయి. 11 నెలల్లో రూ.918.6 కోట్లు (2024 నవంబర్ 1 నుంచి-2025 అక్టోబర్ 16 వరకు) వచ్చినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. విరాళాలతోపాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి దాతలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు వచ్చిందన్నారు.

October 21, 2025 / 10:01 AM IST

అక్టోబర్ 21: మంగళవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం అమావాస్య: సా.4-03 తదుపరి కార్తిక శుక్లపక్ష పాడ్యమి చిత్త: రా.10-18 తదుపరి స్వాతి వర్జ్యం: ఉ.6-40 వరకు తిరిగి తె.4-27 నుంచి అమృత ఘడియలు: మ.3-21 నుంచి 5-05వరకు దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-02వరకు తిరిగి రా.10-30నుంచి 11-20వరకు రాహుకాలం: సా.3-00నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5.57; సూర్యాస్తమయం: సా.5.33 కేదార వ్రతం, ఆకాశ దీపారంభం

October 21, 2025 / 12:40 AM IST

శ్రీ ధనలక్ష్మి అలంకరణలో సీతాదేవి భక్తులకు దర్శనం

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం దీపావళి పండగ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో శ్రీ సీతాదేవి అమ్మవారి ఉత్సవ మూర్తిని శ్రీ ధనలక్ష్మి దేవిగా ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

October 20, 2025 / 08:00 PM IST

బంగారు చీరలో అన్నపూర్ణమ్మ దర్శనం

కోనసీమ: మండపేటలోని బూరుగుంట చెరువు సమీపంలో ఉన్న అన్నపూర్ణ దేవిని బంగారు చీరలో అలంకరించారు. దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి బంగారు పూత పూసిన చీరతో అలంకరించడం ఇక్కడ ప్రతిఏటా ఆనవాతీగా వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

October 20, 2025 / 07:20 PM IST

యాదగిరిగుట్టలో సత్యనారాయణ వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో రవి నాయక్ తెలిపారు. ఈనెల 22 నుంచి నవంబరు 20 వరకు కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ప్రతిరోజు ఆరు విడతల్లో వ్రతాలు జరుగుతాయి. భక్తులు ఉదయం 7, 9, 11 గంటలకు, మధ్యాహ్నం 1, 3, 5 గంటలకు జరిగే వ్రతాలలో పాల్గొనాలని ఆయన కోరారు.

October 20, 2025 / 05:18 PM IST

దీపావళి.. లక్ష్మీ పూజ ఏ సమయంలో చేయాలంటే?

దీపావళి పండుగ సందర్భంగా ఇంటింటా లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. అయితే ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి ఉత్తమ సమయమని పండితులు తెలిపారు. అలాగే, దీపావళి రోజున ప్రదోష కాల సమయం సాయంత్రం 5.45 గంటల నుంచి 8.15 గంటల వరకు ఉంది. అందువల్ల ఈ సమయాల్లో చేసే పూజలకు, ఆచరించే శుభకార్యక్రమాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

October 20, 2025 / 02:21 PM IST

దీపావళి స్పెషల్ స్టోరీ.. శ్రీరాముని అయోధ్య ఆగమనం

పురాణాల ప్రకారం.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ వనవాసం, లంకాధిపతి రావణుడిపై విజయం అనంతరం, శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు ఈ రోజే తిరిగి వచ్చారు. తమ ప్రియతమ రాజు రాకతో ఆనందోత్సాహాలతో పొంగిపోయిన అయోధ్య ప్రజలు, స్వాగతం పలకడానికి తమ ఇళ్లన్నిటినీ దీపాలతో అలంకరించారు. అప్పటినుంచి ఈ శుభసందర్భాన్ని ప్రజలు దీపావళి పండుగగా జరుపుకుంటున్నారు.

October 20, 2025 / 07:51 AM IST

దీపావళి స్పెషల్ స్టోరీ.. నరకాసురుడి మరణం

పురాణాల ప్రకారం, రాక్షసుడైన నరకాసురుడు ప్రజలను, దేవతలను తీవ్రంగా హింసించేవాడు. నరకాసురుడికి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే మరణం సంభవించేలా వరం ఉంది. దీంతో అతడిని సంహరించేందుకు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో కృష్ణుడు పడిపోయినట్లు నటిస్తే, సత్యభామ కోపోద్రిక్తురాలై నరకాసురుడిని సంహరించింది. ఈ శుభసందర్భాన్ని ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకుంటారు.

October 20, 2025 / 07:27 AM IST

అక్టోబర్ 20: సోమవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం చతుర్దశి: మ. 1-37 తదుపరి అమావాస్య హస్త: రా. 8-15 తదుపరి చిత్త వర్జ్యం: తె. 4-56 నుంచి అమృత ఘడియలు: మ. 1-50 నుంచి 3-32 వరకు దుర్ముహూర్తం: మ. 12-08 నుంచి 12-55 వరకు తిరిగి 2-28 నుంచి 3-14 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.57; సూర్యాస్తమయం: సా.5.34 దీపావళి, ధనలక్ష్మీ పూజ

October 20, 2025 / 01:40 AM IST

దీపావళి వేళ ఈ జాగ్రత్తలు మర్చిపోకండి

★ టపాసులు పేల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి.★ చేతులు, ముఖం టాపాసులకు దూరంగా ఉంచి అంటించాలి.★ పనిచేయని వాటిని మళ్లీ వెలిగించేందుకు ప్రయత్నించకండి.★ టపాసులను బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలి. కరెంటు తీగలు, ఎండు గడ్డి, జన సమూహంలో వద్దు.★ చిన్నారులు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి.

October 20, 2025 / 12:39 AM IST

దీపావళిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

దీపావళి పండుగ జరుపుకోవడం వెనుక ఓ కథ ఉంది. దీపావళి అంటేనే ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయం’ అని అర్థం. సముద్ర మథనం జరిగినప్పుడు శ్రీ మహాలక్ష్మీ దేవి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి రోజున లక్ష్మీదేవీ తమ ఇళ్లకు వస్తుందని నమ్మి, ఇంట్లోని చీకటిని పారదోలి, దీపాలతో స్వాగతం పలుకుతారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ పూజ చాలా ప్రాముఖ్యం.

October 19, 2025 / 08:30 PM IST

తలుపులమ్మ తల్లి ఆదాయం వివరాలు

KKD: తుని మండలం లోవలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 6,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాలు, పూజా టిక్కెట్లు, కేశఖండన, వాహన పూజలు, కాటేజీలు, ఇతర విరాళాల ద్వారా మొత్తం రూ. 2,61,779 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో విశ్వనాథరాజు తెలిపారు.

October 19, 2025 / 05:12 PM IST