• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 

December 27, 2024 / 09:22 AM IST

జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

GDWL: జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, ప్రత్యేక అలంకరణ చేసి అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

December 27, 2024 / 09:01 AM IST

శబరిమల ఆలయం మూసివేత

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేశారు. మండల పూజలు ముగియటంతో దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఇప్పటివరకు 32.50 లక్షల మంది అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 30న ఆలయం మళ్లీ తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. కాగా.. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది.

December 27, 2024 / 08:55 AM IST

పెనుగొండ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

శ్రీ సత్యసాయి: పెనుగొండ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాలో బాబా ఫక్రుద్దీన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

December 27, 2024 / 08:44 AM IST

నేటి నుంచి ప్రారంభం కానున్న కందికొత్తుల పండుగ

PPM: గిరిజనుల సాంప్రదాయానికి ప్రతీక అయినా కందికొత్తులు పండుగ నేటి నుంచి ప్రారంభం కానున్నదని గిరిజన సంఘాలునాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొండపోడులో సాగు చేసిన కందులు జొన్నలు, రాగులు, కొర్రలు వరి పంటను ముందుగా గిరిజన దేవతకు నైవేద్యంగా సమర్పిస్తాము. అనంతరం వాటి ఆహారంగా స్వీకరిస్తామని పండగ జరిగే వరకు పంట చేతికొచ్చిన ఆహారం తీసుకోమని తెలిపారు.

December 27, 2024 / 08:30 AM IST

పాలకొండ కోటదుర్గమ్మకు మార్గశిర మాస పూజలు

SKLM: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాసం చివరి గురువారం పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమార్చన, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శత కలశ అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సూర్యనారాయణ తెలిపారు.

December 27, 2024 / 05:42 AM IST

శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

వరుస సెలవులు రావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకూ లైనులో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో భక్తులు ఇవాళ ఉదయం సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ప్రవేశించాలని మైక్‌సెట్లలో విజ్ఞప్తి చేస్తున్నారు.

December 27, 2024 / 03:40 AM IST

డిసెంబర్ 27: శుక్రవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం ద్వాదశి: రా. 1-14 తదుపరి త్రయోదశి విశాఖ: రా. 7-58 తదుపరి అనూరాధ వర్జ్యం: రా. 12-17 నుంచి 2-01 వరకు అమృత ఘడియలు: ఉ. 10-19 నుంచి 12-04 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-43 నుంచి 9-27 వరకు తిరిగి మ. 12-22 నుంచి 1-06 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 6.32; సూర్యాస్తమయం: సా.5.29.

December 27, 2024 / 01:05 AM IST

విగ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.73 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు భక్తుల నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.1,73,903 ఆదాయం లభించిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా 330 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని తెలిపారు.

December 26, 2024 / 05:19 PM IST

అయ్యప్ప స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన

SRD: మండల పూజా మహోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు పుష్పాలకు పూజలు చేసి స్వామివారికి సమర్పించారు. పుష్పాలను అయ్యప్పస్వామికి ప్రత్యేకంగా అలంకరించారు.

December 26, 2024 / 03:19 PM IST

వాల్మీకిపురం శివాలయంలో ప్రత్యేక పూజలు

CTR: వాల్మీకిపురంలోని కోనేటి వీధిలో ఉన్న శివాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, అర్చనలు, విశేషాలంకరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

December 26, 2024 / 01:55 PM IST

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు

ATP: పెద్దవడుగూరు మండలంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకములు, విష్ణు అష్టోత్తర శతనామావళి, పలు పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.

December 26, 2024 / 12:41 PM IST

యాదగిరిగుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేక పూజలు, ఏకాదశ లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల నమో నారసింహ, గోవింద నామస్మరణలతో యాదగిరులు మార్మోగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

December 26, 2024 / 12:10 PM IST

సీలేరు మారెమ్మ అమ్మవారికి వెండి కిరీటం వితరణ

ASR: జీకేవీధి మండలం సీలేరు శ్రీ మారెమ్మ అమ్మవారికి తుని పట్టణానికి చెందిన కొరసాల సాయివినీల్ కాంత్, జాస్మిన్ దంపతులు గురువారం వెండి కిరీటాన్ని వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దామోదర శర్మ మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించారు.

December 26, 2024 / 12:09 PM IST

రేపు శబరిమలలో మండల పూజ

శబరిమలలో రేపు అయ్యప్ప మండల పూజ నిర్వహించనున్నారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మధ్యాహ్నం 12 నుంచి 12:30 గంటల మధ్య శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కందారరు రాజీవారు మండల పూజను నిర్వహిస్తారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కేరళీయులు పెద్దసంఖ్యలో మండల పూజకు వచ్చే అవకాశం ఉంది. దీంతో NDRF బృందాలు భారీగా మోహరించాయి.

December 25, 2024 / 10:09 PM IST