NLR: సంగంలోని శ్రీ వెంకయ్య స్వామి గుడిలో ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో శ్రీ వెంకయ్య స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.
W.G: కాళ్ళ మండలం కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రావణ శనివారం పోలాంబ అమావాస్య పర్వదినము పురస్కరించుకుని సాయంత్రం అంగరంగ వైభవంగా అష్టోత్తర శతనామార్చన, సహస్రదీపాలంకరణ సేవ, ఉంజల్ సేవ ఘనంగా జరిపారు. భక్తుల గోవింద నామస్మరణతో దేవాలయం భక్తులతో కిటకిట లాడింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని ఈవో ఎం.అరుణ్ కుమార్ తెలిపారు.
CTR: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ఆలయంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ఆకు పూజతో పాటు రంగురంగుల పుష్పాలతో అలంకరణ చేసి అభిషేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
E.G: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ వేకువజామున నుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి శనివారం రూ. 55.60 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధర్ రావు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
KKD: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు వివిధ సేవలు ద్వారా రూ. 3,65,750 ఆదాయం వచ్చినట్లు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు.
KRNL: పత్తికొండ పట్టణంలో శ్రావణ మాసం 4వ శనివారం అమావాస్య సందర్భంలో శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు ఘనంగా జరిగింది. తెల్లవారుజామున పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామి విగ్రహానికి టెంకాయలు, పూలు, పండ్లు సమర్పించారు. ఊరేగింపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనుంది.
WGL: శ్రావణమాసం అమావాస్య శనివారం సందర్భంగా భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులున్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హీరేహల్ మండలం మురిడీ గ్రామంలో వెలసిన ఆంజనేయుడికి శ్రావణమాసం చివరి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి స్వామి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి, మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.
NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 5.77 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
VSP: సింహాద్రి అప్పన్న స్వామికి శ్రీకాకుళానికి చెందిన రాజారాం, కిరణ్ రాజ్ 49 గ్రాముల బంగారు శంఖు నామ చక్రాలతో కూడిన చైన్ను బహుకరించారు. ఆలయ డిప్యూటీ ఈవో సింగం రాధా, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు సమక్షంలో స్వామివారికి ఈ వస్తువును అందించారు. దాతలకు స్వామివారి దర్శనం కల్పించి వేద ఆశీర్వాచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
AKP: గొలుగొండ మండలం ఏఎల్ పురంలో ఘనంగా మరిడిమాంబ జాతర నిర్వహించారు. బుధ, గురు రెండు రోజులు ఘనంగా అమ్మవారి జాతరను జరుపుకున్నారు. జాతరలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్ నిర్వహించారు. అధిక భక్తులు రావడంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
ATP: రాయదుర్గం పట్టణంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతున్న మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లేట్ పి. కృష్ణకుమారి కుమార్తెలు తెలిపారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని సూచించారు.
AKP: అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని శ్రావణమాసం 5వ శుక్రవారం సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మండపంలో మహిళలతో కలిసి సామూహికంగా కుంకుమ పూజలో పాల్గన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమట్టి జగన్మోహన్ రాజు అన్నారు. ఆయన శుక్రవారం కోదండ రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. కోదండ రామస్వామి ఆశీస్సులతో రాజంపేట అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.