ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి మూలమూర్తికి సింధూర, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.