KDP: జడ్పీ హైస్కూల్లో సైతం రాజకీయాలకు వేదికగా మార్చిన ఘనత బద్వేల్ వైసీపీ నాయకులది అని ప్రజలు విమర్శిస్తున్నారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమానికి జన సమీకరణ కోసం వైసీపీ నాయకులు హైస్కూలును వేదికగా చేసి ప్లకార్డులు, బ్యానర్లతో పాఠశాల ఆవరణంలో నాయకులు నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్న హైస్కూల్ హెడ్ మాస్టర్, సిబ్బంది చోద్యం చూస్తూ ఉండి పోయారు అన్నారు.