అన్నమయ్య: కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ పట్టడం లేదని మదనపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ అన్నదాత పోరుబాటలో ఆయన పాల్గొన్నారు. యూరియా వద్దు, మద్యం ముద్దని నినాదం చేశారు. రైతులకు యూరియా దొరకలేదని, ఎటుచూసిన మద్యం ఏరులై పారుతోందన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.