NZB: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని PDSU NZB జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రివాల్యుయేషన్ కాకుండా గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా TGPSC అవకతవకలు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.