కృష్ణా: కోడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిచిన నీటిని మళ్లించి, గుంతలు పూడ్చాలని మంగళవారం ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రహదారి నుంచి బస్టాండ్ లోపలికి వెళ్లేందుకు రెండు ప్రక్కల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షం కురిసినప్పుడు అవి చెరువుల్ని తలపిస్తున్నాయని, వాటి కారణంగా ప్రయాణికులు ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.