మెదక్: పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన సేవా పక్షం జిల్లా కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్లమెంట్ కో కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేయవలసిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు.