GDWL: గొర్రెలకు ఉచిత టీకాలను వేయించాలని ఇటిక్యాల మండల వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి అన్నారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని కోదండాపురంలో పశువులు, గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ సీజన్లో పాడి పశువులు ఎక్కువగా మర్బిల్లి వ్యాధులకు గురవుతాయన్నారు. తీవ్రమైన విరేచనాలు, దగ్గు లక్షణాలు ఉండి జీవాలు చనిపోతాయని అన్నారు.