కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని గురువారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ. 1,26,495 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, అన్నదాన ట్రస్ట్ ద్వారా 1510 మంది అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.