CTR: పుంగనూరు పట్టణం పుష్కరి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం విశేషపూజలు జరిగాయి. ముందుగా, గణపతి పూజ, పుణ్య వచనాలు, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.